గ్రుహిణులని మాత్రమే టార్గెట్ చేసుకున్న టివిలో వచ్చే సీరియల్స్ ( సోప్స్) ఇప్పుడు సీనియర్ సిటిజెన్స్ ని కూడా వదలటంలేదు. అన్ని చానెల్స్ కొత్త పోకడలకి శ్రీకారం చుట్టాయి ..ఈ మధ్య మా ఇంటికి బాగా తెలిసిన వాళ్ళు వచ్చారు..అందరం కలసి కాసేపు కష్టం సుఖం మట్లాడుకోవచ్చనీ.మా వాడికి బాగా కాలక్షేపం కూడా అవుతుందని ఎంతో ఆశ పడ్డాను. కాని నా ఆశ మీద జల్ తుఫాన్ కుంభవ్రుష్టి కురిపించింది.. వారితో పలకరింపుల కార్యక్రమం అయిన వెంటనే తాతగారు ( వచ్చిన వారిలో పెద్దాయన)బాబు కొంచెం ఆ టివి పెడతావూ అన్నారు..అయ్యో తాతగారు మీరు కూడా నా అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి వారికి కావల్సిన చానెల్ పెట్టాను ..అంతే ఒక అరగంట సేపు ఇంట్లొ టివి సౌండు తప్ప ఇంకా ఏమి వినిపించలేదు..
నాకు చాలా ఆశ్చర్యం వేసి ఎప్పుడూ భక్తి చానెల్ చూసే మీరు ఎందుకు ఇలా మారిపోయారు అని అడగ్గా ఆయన "ఏమి చెప్తాం నాయనా ఈ సీరియల్ మొదట కాశీ అంతా చూపించాడు అలా చూస్తూ దీనికి ఎడిక్ట్ అయిపోయాం అని చెప్పుకొచ్చారు"
కొసమెరుపు: ఈ రోజు పొద్దున ఆఫీస్ కి వెళుతూ ఒక్కసారి తుఫాన్ అప్డేట్ చుద్దాం అని తొమ్మిదో చానెల్ పెట్టగానే బ్రేకింగ్ న్యూస్ చెన్నై , పుదుచ్చేరి లో భారీ వర్షాలు స్కూళ్ళకి , ఆఫీసులకి సెలవు " అని కనిపించింది..సదరు చెన్నై విలేఖరి పైన లైవు లో మట్లాడుతుంది మెరీనా బీచ్ నుండి .."ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది ఎండ కూడా వచ్చింది అని"
పెట్టక..పెట్టక ఆ చానెల్ నె పెట్టారు..
రిప్లయితొలగించండి